కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-05-17T05:20:38+05:30 IST

కరోనా బారిన పడకుండా, రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు సూచించారు.

కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలి: ఎస్పీ

కర్నూలు, మే 16: కరోనా బారిన పడకుండా, రోగ నిరోధక శక్తి పెంచుకుంటూ వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ ఫక్కీరప్ప ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కు సూచించారు.  ఆదివారం ఎస్పీ తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యులు, పోలీసు సిబ్బందితో మాట్లాడారు. ఎస్పీ మాట్లాడుతూ కంగారుపడి స్టెరాయిడ్స్‌ తీసుకోవద్దని, స్టెరాయిడ్స్‌తో ఇమ్యూనిటీ తగ్గిపోతుంద అన్నారు. అలర్జీ, గర్భిణులు, శిశువులకు పాలు ఇచ్చే తల్లులు తప్ప మొత్తం 97 శాతం జిల్లా పోలీసు సిబ్బంది అందరికీ కరోనా టీకా పూర్తి చేశామన్నారు. స్పెషలిస్టు వైద్యులు రవికళాధర్‌ రెడ్డి, మహేష్‌లచే కొవిడ్‌పై పోలీసులకు పలు సూచనలు ఇప్పించారు. కరోనా బారిన పడినప్పుడు హోం క్వారంటైన్‌, హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు పాటించవలసిన జాగ్రత్తల గురించి తెలియజేశారు. వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయా సబ్‌ డివిజన్‌ల నుంచి పోలీసులు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T05:20:38+05:30 IST