విజిలెన్స్‌ అధికారుల దాడి

ABN , First Publish Date - 2021-04-11T06:48:34+05:30 IST

మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో విజిలెన్సు, ఎన్‌పోర్సుల సీఐ బీటీ నాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలపై శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు.

విజిలెన్స్‌ అధికారుల దాడి
అక్రమ రేషన్‌ బియ్యం నిల్వలతో విజిలెన్సు సిబ్బంది

తాళ్లూరు, ఏప్రిల్‌ 10 : మండలంలోని తూర్పుగంగవరం గ్రామంలో విజిలెన్సు, ఎన్‌పోర్సుల సీఐ బీటీ నాయక్‌ ఆధ్వర్యంలో సిబ్బంది అక్రమ రేషన్‌ బియ్యం  నిల్వలపై శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. గ్రామంలో అక్రమరేషన్‌ నిల్వలు ఉన్నట్లు విజిలెన్సు అధికారులకు సమాచారం అందడంతో గ్రామంలోని తాళ్లూరు బస్టాండ్‌ కూడలిలోని కోటలక్ష్మిరెడ్డి గూడెంను తనిఖీ చేశారు. గూడెంలో పీడిఎస్‌ బియ్యం 89 బస్తాల(55కేజీల బస్తాలు) అక్రమంగా నిల్వ ఉన్నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసి నిల్వ ఉన్న అక్రమరేషన్‌ బియ్యాన్ని తాళ్లూరు పోలీస్‌ స్టేషనుకు అప్పగించారు. ఆ బియాన్ని స్థానిక వీఆర్‌వో రాఘవరెడ్డికి స్వాదీనం చేశారు.  కార్యక్రమంలో ఎన్‌పోర్సుమెంట్‌ డీటీ భూపతి, విజిలెన్సు సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-11T06:48:34+05:30 IST