ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ABN , First Publish Date - 2021-12-01T04:48:09+05:30 IST
మండల పరిధిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు చేశారు.
రాజుపాలెం, నవంబరు 30 : మండల పరిధిలోని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు మంగళవారం దాడులు చేశారు. విజిలెన్స్ సీఐ పురుషోత్తంరాజు ఆధ్వర్యంలో ఎస్ఐలు, సిబ్బంది ఎరువుల దుకాణాల్లో విసృత్త తనిఖీలు చేపట్టి ఈ సందర్భంలో రెండు ఎరువుల దుకాణాలను విజిలెన్స్ అధికారులు సీజ్ చేశారు. వివరాల్లోకి వెళితే... మండలంలోని మణ్యం ఫర్టిలైజర్స్, కృషి ఆగ్రో ఫర్టిలైజర్ షాపుల్లో విజిలెన్స్ అధికారులు చేపట్టిన తనిఖీల్లో ఉన్న స్టాకుకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో మణ్యం ఫర్టిలైజర్స్లో రూ.6.16లక్షలు విలువ చేసే ఎరువులతో పాటు పురుగుల మందులను సీజ్ చేసినట్లు విజిలెన్స్ సీఐ పురుషోత్తంరాజు తెలిపారు. అదే విధంగా కృషి ఆగ్రో ఫర్టిలైజర్స్లో రూ.34,900లు విలువ చేసే ఎరువులు, పురుగుల మందులను సీజ్ చేసినట్లు చెప్పారు. అధిక వర్షాలతో పంటలు నష్టపోయి, అప్పులు తెచ్చి ఎరువులు, పురుగుల మందుల కోసం ఎరువుల దుకాణాలకు వెళితే నకిలీవి అంటగడుతున్నారని, ఇది మండలమంతా జరుగుతోందని, మండలంలోని అన్ని ఎరువుల దుకాణాలపై విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టాని రైతులు కోరుతున్నారు.