విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు
ABN , First Publish Date - 2021-03-31T23:52:41+05:30 IST
విజయవాడ దుర్గగుడిలో కొనసాగుతున్న విజిలెన్స్ సోదాలు
కృష్ణా: బెజవాడ దుర్గగుడిలో విజిలెన్స్ సోదాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం నుంచి విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. సెక్యూరిటీ, శానిటరీ టెండర్లలో అవకతవకలపై విజిలెన్స్కు ఫిర్యాదులు అందాయి. ఇంద్రకీలాద్రి జెమ్మిదొడ్డి ఆఫీసులో విజిలెన్స్ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. స్టోర్స్, చీరల విభాగం, అన్నదాన విభాగంలో రికార్డులప పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ఏసీబీ దాడుల్లో 15 మంది అధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.