క్యాంపస్ ఇంటర్వ్యూలకు విజ్ఞాన్ వర్సిటీ విద్యార్థుల ఎంపిక
ABN , First Publish Date - 2021-01-26T05:51:39+05:30 IST
ప్రముఖ ఆటోమేషన్ స్టార్టప్ కంపెనీ సీఎన్సీ యూనిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
గుంటూరు(విద్య), జనవరి 25: ప్రముఖ ఆటోమేషన్ స్టార్టప్ కంపెనీ సీఎన్సీ యూనిటెక్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూల్లో 26 మంది విద్యార్థులు ఎంపికయ్యారని వీసీ డాక్టర్ ఎంవైఎస్ ప్రసాద్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. విద్యార్థులను సంస్థల చైర్మన్ డాక్టర్ లావు రత్తయ్య, ఉపాధ్యక్షుడు లావు శ్రీకృష్ణదేవరాయలు అభినందించారు. తమ విద్యార్థులకు ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచే క్యాంపస్ ఇంటర్వ్యూలకు ప్రత్యేక శిక్షణ ఇస్తామని అందువల్లే ఈ స్థాయిలో ఫలితాలు సాధిస్తున్నారని వీసీ పేర్కొన్నారు.