కాలుష్యం కోరల్లోనే జీవకోటి

ABN , First Publish Date - 2020-12-04T06:12:34+05:30 IST

ప్రపంచ జనాభా మొత్తం కాలుష్య కోరల్లోనే మనుగడ సాగిస్తుందని యూఎస్‌లోని జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌ ఆచార్య ఎర్రమెల్లి ఆంజనేయులు తెలిపారు.

కాలుష్యం కోరల్లోనే జీవకోటి
వెబ్‌నార్‌లో మాట్లాడుతున్న ఆచార్య ఆంజనేయులు

జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌  

గుంటూరు(విద్య), డిసెంబరు 3: ప్రపంచ జనాభా మొత్తం కాలుష్య కోరల్లోనే మనుగడ సాగిస్తుందని యూఎస్‌లోని జాక్సన్‌ స్టేట్‌ వర్సిటీ విశ్రాంత డైరెక్టర్‌ ఆచార్య ఎర్రమెల్లి ఆంజనేయులు తెలిపారు. ఎన్విరాన్‌మెంట్‌ స్టేట్‌ పోరం, డిపార్టుమెంట్‌ ఆప్‌ సైన్స్‌ అండ్‌ హ్యూమానిటీస్‌ ఆధ్వర్యంలో వడ్లమూడిలోని విజ్ఞాన్‌ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌నార్‌లో ఆయన మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా గాల్లో స్వచ్ఛత కరువైందన్నారు. వాయు కాలుష్యం అత్యధికంగా ఉన్న దేశాల్లో నేపాల్‌ తరువాత భారత్‌ రెండో స్థానంలో ఉందన్నారు. కార్యక్రమంలో వీసీ డాక్టర్‌ ఎంవైఎస్‌ ప్రసాద్‌, రిజిస్ట్రార్‌ ఎంఎస్‌ రఘునాథన్‌, డీన్‌ డాక్టర్‌ ఎం రామకృష్ణ, డాక్టర్‌ ఎన్‌ శ్రీనివాసు, ఆచార్య కోయి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-04T06:12:34+05:30 IST