విజయ దశమి విజయాలను చేకూర్చాలి: ఎస్పీ

ABN , First Publish Date - 2021-10-15T06:35:54+05:30 IST

విజయ దశమి పండుగ ప్రజలకు విజయాన్ని తీసుకు రావాలని దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. గురువారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో వేద పండితుల ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు.

విజయ దశమి విజయాలను చేకూర్చాలి: ఎస్పీ
ఆయుధ పూజలో పాల్గొన్న ఎస్పీ రాజేశ్‌ చంద్ర

ఆదిలాబాద్‌టౌన్‌, అక్టోబరు 14: విజయ దశమి పండుగ ప్రజలకు విజయాన్ని తీసుకు రావాలని దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరు సుఖసంతోషాలతో ఉండాలని ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. గురువారం జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్‌లో వేద పండితుల ఆధ్వర్యంలో ఆయుధ, వాహన పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిస్వార్థంగా విధులు నిర్వర్తించే పనుల్లో తప్పకుండా విజయం ఉంటుందన్నారు. ఇందులో అదనపు ఎస్పీలు శ్రీనివాస్‌రావు, సమైజాన్‌రావు, బి.వినోద్‌కుమార్‌, డీఎస్పీలు వెంకటేశ్వర్‌రావు, ఎం.విజయ్‌కుమార్‌, సీఐలు పోతారం శ్రీనివాస్‌, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-15T06:35:54+05:30 IST