విజయ గర్జన సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తాం: పువ్వాడ

ABN , First Publish Date - 2021-10-24T20:39:36+05:30 IST

విజయ గర్జన సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

విజయ గర్జన సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తాం: పువ్వాడ

ఖమ్మం: విజయ గర్జన సభను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ ప్రకటించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పైసలిచ్చి పదవులు తెచ్చుకుని అవాకులు చవాకులు పేలుతున్నారని దుయ్యబట్టారు. ఈ అక్రమార్కులు సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోరని అన్నారు. మరికొందరేమో రాజన్న రాజ్యం తెస్తామని అంటున్నారని చెప్పారు. రాజన్న రాజ్యం అంటేనే..రైతుల ఆత్మహత్యలు, బయ్యారం గనుల దోపిడీ, జలయజ్ఞం పేరుతో ధనయజ్ఞమని పువ్వాడ అజయ్ విమర్శించారు.


Updated Date - 2021-10-24T20:39:36+05:30 IST