విజయగర్జన సభను విజయవంతం చేయాలి : చైర్మన్‌ ఈశ్వర్‌

ABN , First Publish Date - 2021-10-24T06:53:14+05:30 IST

వచ్చే నెల 15న టీఆర్‌ఎస్‌ వరంగల్‌లో నిర్వహించబోయే విజయ గర్జన సభ విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

విజయగర్జన సభను విజయవంతం చేయాలి : చైర్మన్‌ ఈశ్వర్‌
సమావేశంలో మాట్లాడుతున్న ఈశ్వర్‌

నిర్మల్‌ కల్చరల్‌, అక్టోబరు 23 : వచ్చే నెల 15న టీఆర్‌ఎస్‌ వరంగల్‌లో నిర్వహించబోయే విజయ గర్జన సభ విజయవంతం చేయాలని మున్సిపల్‌ చైర్మన్‌ జి. ఈశ్వర్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పట్టణాధ్యక్షుడు మారుగొండ రాము అధ్యక్షతన జరిగిన సమావేశంలో పట్టణ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. అందరూ సమిష్టిగా కృషి చేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఈశ్వర్‌ అన్నారు. హైద రాబాద్‌లో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ చేసిన సూచనలు వివరించారు. వైస్‌ చైర్మన్‌ సాజిద్‌, అధికార ప్రతినిధి ఎం. సత్యనారాయణ, నాయకులు కోటగిరి అశోక్‌, డి. శ్రీనివాస్‌, వేణు, ఇతర కౌన్సిలర్లు పాల్గొన్నారు. 

మినీ ట్యాంక్‌బండ్‌ పనుల పరిశీలన

మినీ ట్యాంక్‌బండ్‌ ప్రాంతంలో కొనసాగుతున్న వాకింగ్‌ట్రాక్‌ పనులు చైర్మన్‌ ఈశ్వర్‌ శనివారం సాయంత్రం పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రత తదితర వాటిపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఏఈ వినయ్‌కుమార్‌, టీపీవో సుమలత, సానిటరీ అఽధికారి రవీందర్‌, కౌన్సిలర్‌ ముజ్జు చావుస్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-24T06:53:14+05:30 IST