vijayanagaram: పీటీసీలో ఎస్ఐ భవానీ ఆత్మహత్య
ABN , First Publish Date - 2021-08-29T17:25:11+05:30 IST
ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పీటీసీలో ఎస్ఐ భవానీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది
విజయనగరం: ఓ మహిళా ఎస్సై ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పీటీసీలో ఎస్ఐ భవానీ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలో ఎస్ఐగా భవానీ విధులు నిర్వహిస్తోంది. అయితే.. పీటీసీ శిక్షణలో భాగంగా ఎస్ఐ భవానీ విజయనగరంకు వచ్చింది. ఉన్నట్టుండి భవానీ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం తెలియాల్సివుంది. ఎస్ఐ భవానీ ఆత్మహత్యకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సివుంది.