AP: ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసుల మోహరింపు
ABN , First Publish Date - 2022-01-20T15:54:46+05:30 IST
జిల్లాలోని సీతానగరం ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.
విజయనగరం: జిల్లాలోని సీతానగరం ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని ఈరోజు చక్కెర కర్మాగారాన్ని ముట్టడించే నేపథ్యంలో వామపక్ష నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్లు చేస్తున్నారు. కర్మాగారం ముట్టడికి అనుమతులు లేవంటూ చర్యలు చేపట్టారు. కర్మాగారం ముట్టడికి వెళ్లిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామంటూ పోలీసులు హెచ్చరించారు.