దీన్ని బంద్ అంటారా.. వామపక్ష నేతలపై విజయసాయి ఫైర్
ABN , First Publish Date - 2021-03-05T17:38:09+05:30 IST
స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్లో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి...
విశాఖ: స్టీల్ ఫ్యాక్టరీకి మద్దతుగా శుక్రవారం చేపట్టిన బంద్లో పాల్గొన్న రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి... మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా మైకు పట్టుకుని, అందరి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మద్దిలపాలెంలో వామపక్షాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ‘‘ఒక్క వాహనం కూడా నిలపలేదు... అన్ని వాహనాలు యథావిధిగా వెళ్తున్నాయి. దీన్ని బంద్ అంటారా’’ అంటూ వామపక్ష నేతలను నిలదీశారు. విజయసాయి వ్యాఖ్యలకు సీపీఎం నేత కుమార్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. ‘‘మీ పార్టీ వాళ్ళు ఎవరు రాలేదు. జెండా కూడా పట్టుకోలేదు’’ అని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత విజయసాయి మాట్లాడుతూ.. ‘‘కరోనాకు భయపడేవాళ్ళు.. ఉద్యమాలు ఏం చేస్తారు’’ అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.