టీడీపీ డ్రామాలాడుతోంది... విజయసాయి విమర్శలు

ABN , First Publish Date - 2021-03-05T17:57:50+05:30 IST

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్‌లో పాల్గొన్న వైసీపీ ...

టీడీపీ డ్రామాలాడుతోంది... విజయసాయి విమర్శలు

విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బంద్‌లో పాల్గొన్న వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి... స్థానికుల నుంచి వివిధ పక్షాల నుంచి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. మద్దిలపాలెం వద్ద ఏర్పాటు చేసిన మానవహారంలో పాల్గొన్న ఆయనను.. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లే బాధ్యత తీసుకోవాలని వామపక్ష నేతలు కోరారు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. ఓటమి అయితే ప్రభుత్వానిది, గెలుపు అయితే అందరిదీ అనే మాట కాకుండా గెలుపోటములకు అందరూ సమిష్టి బాధ్యత తీసుకోవాలన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా తమ పోరాటం చివరి వరకు కొనసాగుతుందన్నారు. దీనికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. చంద్రబాబు నాయుడు, పప్పు నాయుడు డ్రామాలాడుతున్నారంటూ టీడీపీపై విమర్శలు చేశారు. అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని.. విషయం ఏదైనా సరే సమష్టిగానే పోరాడుతామన్నారు. కార్మిక సంఘాలు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి తాము సిద్ధంగా ఉంటామని తెలిపారు. 

Updated Date - 2021-03-05T17:57:50+05:30 IST