అవన్నీ అవాస్తవమే.. విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ABN , First Publish Date - 2021-09-02T17:02:38+05:30 IST

గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ విశాఖ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి అక్రమాలకు

అవన్నీ అవాస్తవమే.. విజయసాయిరెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

విశాఖపట్నం: గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిస్తూ విశాఖ వేదికగా కీలక వ్యాఖ్యలు చేశారు. తన పేరు చెప్పి అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని ఆయన స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. విశాఖలో పర్యటనలో భాగంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. విశాఖ ప్రజలకు సేవ చేయడమే తన ధ్యేయమన్నారు. కొందరు పని కట్టుకుని తన మీద భూ ఆరోపణలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. భూములు ఆక్రమించాలని కానీ.. ఇక్కడ కొనుగోలు చేయాలని తనకు లేదన్నారు. ఇన్ని రోజులుగా తనపై వస్తున్న ఆరోపణలన్నీ అసత్యాలేనని విజయసాయిరెడ్డి తేల్చి చెప్పారు.

Updated Date - 2021-09-02T17:02:38+05:30 IST