కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-13T03:56:56+05:30 IST

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు.

కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉంది: విజయశాంతి

హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు రంగులు మార్చే ఊసరవెల్లి మాదిరిగా ఉందని బీజేపీ నాయకురాలు విజయశాంతి విమర్శించారు. వరి వేసుకుంటే ఉరి వేసుకున్నట్లేనని, రైతులు యాసంగిలో వరి సాగు చేయవద్దనే ప్రచారాన్ని మొదలుపెట్టి ధర్నా పేరుతో రాద్ధాంతాన్ని సృష్టిస్తూ రైతులను ఆందోళనలో పడేస్తున్నారని ఆరోపించారు. కేంద్రంపై నిందలు వేయడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా తెలంగాణ సమాజం రాష్ట్ర సర్కార్ కపటనాటకాలను గమనించి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను గద్దె దించాలని విజయశాంతి పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 



Updated Date - 2021-11-13T03:56:56+05:30 IST