ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉంది: విజయశాంతి

ABN , First Publish Date - 2021-12-27T20:07:33+05:30 IST

నిరుద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉంటుందని విజయశాంతి అన్నారు.

ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉంది: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అండగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఉంటుందని ఆ పార్టీ నాయకురాలు విజయశాంతి అన్నారు. సోమవారం బండి సంజయ్ చేపట్టిన నిరుద్యోగ దీక్షలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ఉద్యోగాలు ఇస్తామని యువతను టీఆర్ఎస్ మోసం చేసిందని విమర్శించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆమె సూచించారు. తెలంగాణ కోసం చేసిన పోరాటం.. మళ్లీ ఇప్పుడు చేద్దామని పిలుపు ఇచ్చారు. ఈ ప్రభుత్వాన్ని కూలదూసే సత్తా యువతకు ఉందన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సమస్యలను పక్కకు పెట్టారని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం వచ్చిందన్నారు. రాబోయే రోజుల్లో అనేక సమస్యలపై బీజేపీ పోరాడుతుందని విజయశాంతి స్పష్టం చేశారు.


కాగా బండి సంజయ్‌ నిరుద్యోగ దీక్షకు విద్యావాలంటీర్లు సంఘీభావం ప్రకటించారు. రెండేళ్ల నుంచి ధర్నా చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, కనీసం వేతనం కూడా ఇవ్వడం లేదని, ఉద్యోగాలు లేక యువత ఆత్మహత్య చేసుకుంటున్నారని విద్యావాలంటీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-12-27T20:07:33+05:30 IST