కేసీఆర్పై రాములమ్మ సెటైర్లు
ABN , First Publish Date - 2021-11-17T04:57:13+05:30 IST
హైదరాబాద్: ఎన్నికలప్పుడు హామీలు గుప్పించడానికి మాత్రమే కనిపించే తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రెటేరియట్లో దర్శనం ఇవ్వడం ఎప్పుడో మానేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు.
హైదరాబాద్: ఎన్నికలప్పుడు హామీలు గుప్పించడానికి మాత్రమే కనిపించే తెలంగాణ సీఎం కేసీఆర్ సెక్రెటేరియట్లో దర్శనం ఇవ్వడం ఎప్పుడో మానేశారని బీజేపీ నాయకురాలు విజయశాంతి ఆరోపించారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి వచ్చిన ప్రజలకు మంత్రులు, అధికారులు అందుబాటులో ఉండటం లేదన్నారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారుకు తగిన జవాబు చెప్పేందుకు ప్రజలు ఆతృతగా ఎదురు చూస్తున్నారంటూ విజయశాంతి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.