కేసీఆర్ మాటలు నీట మూటలు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-29T01:28:01+05:30 IST

హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు పదేపదే చెబుతూ వచ్చిన కేసీఆర్ మాటలు నీట మూటలుగానే మిగిలాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు.

కేసీఆర్ మాటలు నీట మూటలు: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన అర్హులందరికీ వెంటనే పెన్షన్లు ఇవ్వనున్నట్లు పదేపదే చెబుతూ వచ్చిన కేసీఆర్ మాటలు నీట మూటలుగానే మిగిలాయని బీజేపీ నాయకురాలు విజయశాంతి చెప్పారు. అర్హత గల వారు మూడేండ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడంలేదంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. వితంతువులు, దివ్యాంగులు, గీత, చేనేత కార్మికులు, బోదకాలు బాధితులు, ఒంటరి మహిళలకు కూడా ప్రభుత్వం కొత్తవి మంజూరు చేయట్లేదన్నారు. ఏటా 50 వేల నుంచి 60 వేల మంది చొప్పున మూడేండ్లలో సుమారు 1.70 లక్షల మందిని జాబితా నుంచి తీసేసిన ప్రభుత్వం... వీరి స్థానంలో కొత్తవారికి పెన్షన్లు మంజూరు చేయలేదని ఆమె ఆరోపించారు. కేసీఆర్ సర్కార్‌కు రానున్న రోజుల్లో ఓటర్లు తగిన బుద్ది చెప్పడం ఖాయమని విజయశాంతి జోస్యం చెప్పారు. 



Updated Date - 2022-01-29T01:28:01+05:30 IST