బీజేపీ అధికారంలోకి వస్తే... బంగారు బోనం ఎత్తుత: విజయశాంతి

ABN , First Publish Date - 2021-08-01T19:04:05+05:30 IST

ఏడేళ్ల క్రితం తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని...

బీజేపీ అధికారంలోకి వస్తే... బంగారు బోనం ఎత్తుత: విజయశాంతి

హైదరాబాద్‌: ఏడేళ్ల క్రితం తెలంగాణ వస్తే బంగారు బోనం ఎత్తుకుంటానని మొక్కుకున్నానని.. అమ్మవారు తెలంగాణ ఇచ్చిందని, బంగారు బోనం ఎత్తానని బీజేపీ నేత విజయశాంతి అన్నారు. ఆదివారం రాములమ్మ లాల్ దర్వాజ అమ్మవారిని దర్శించుకుని బోనం సమర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌తో ప్రజలు బాధపడుతున్నారని.. కరోనా తగ్గి అందరిని కాపాడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మంచి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, రాబోయే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి తీసుకువస్తే బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నట్లు చెప్పారు. ప్రజా పాలన బీజేపీ వల్లే సాధ్యమవుతుందన్నారు. ప్రతి సంవత్సరం మాదిరి ఈ ఏడాది కూడా  అమ్మవారికి బోనం సమర్పించుకున్నానని విజయశాంతి చెప్పారు.

Updated Date - 2021-08-01T19:04:05+05:30 IST