‘KCR’కు కొత్త అర్థం చెప్పిన విజయశాంతి
ABN , First Publish Date - 2021-12-19T22:04:08+05:30 IST
సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు.
హైదరాబాద్: సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయశాంతి మండిపడ్డారు. రాష్ట్రంలో K(కోతి), C(చేష్టల), R(రావు) రాజ్యం తీరుగా గత్తరబిత్తర పాలన సాగుతోందని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. బీజేపీ కార్యకర్తలను తిరగనీయకండ్రంటూ తిక్క బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాగ్రహంతోనే కుంటిసాకులు చూపి జిల్లా పర్యటనను వాయిదా వేసుకున్నారని చెప్పారు. హుజూరాబాద్ తరహాలో కేసీఆర్కు బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని వ్యాఖ్యానించారు.