కేసీఆర్ అలా ప్రశ్నించడం సిగ్గు చేటు: విజయశాంతి

ABN , First Publish Date - 2021-11-18T01:31:28+05:30 IST

రాష్ట్రాలపై కేంద్రం పెత్తతాన్ని ప్రశ్నించే కేసీఆర్.. వరిని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు..

కేసీఆర్ అలా ప్రశ్నించడం సిగ్గు చేటు: విజయశాంతి

హైదరాబాద్: రాష్ట్రాలపై కేంద్రం పెత్తతాన్ని ప్రశ్నించే కేసీఆర్.. వరిని కేంద్రమే కొనాలని డిమాండ్ చేయడం సిగ్గుచేటని భారతీయ జనతా పార్టీ నేత విజయశాంతి అన్నారు. బుధవారం తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్పందిస్తూ సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. గతంలో రైతులు పండించిన ప్రతి గింజా కొంటామని.. సాగునీటి ప్రాజెక్టులున్నామని.. గప్పాలు కొట్టిన ముఖ్యమంత్రి.. నేడు రైతుల పట్ల రెండు నాల్కల ధోరణి అవలంభిస్తూ కేంద్రాన్ని తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడుతున్న బాధలను తెలుసుకోవడానికి వెళ్లిన బీజేపీ నేతలు, కార్యకర్తలపై టీఆర్ఎస్ గుండాలతో దాడి చేయించడం సిగ్గుచేటని విజయశాంతి విమర్శించారు.


కేసీఆర్‌పై విజయశాంతి చేసిన వ్యాఖ్యలను పూర్తిగా తెలుసుకునేందుకు ఈ కింది లింకుపై క్లిక్ చేయండి..



Updated Date - 2021-11-18T01:31:28+05:30 IST