కేసీఆర్ కరోనా ఆంక్షలు పక్కనపెట్టి మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టారు: విజయశాంతి

ABN , First Publish Date - 2022-01-22T20:52:09+05:30 IST

తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ఫస్ట్‌డోస్ 100%, రెండో డోస్ 80% అయిందని సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు.

కేసీఆర్ కరోనా ఆంక్షలు పక్కనపెట్టి మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టారు: విజయశాంతి

హైదరాబాద్: తెలంగాణలో వ్యాక్సినేషన్‌ ఫస్ట్‌డోస్ 100%, రెండో డోస్ 80% అయిందని సీఎం కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని బీజేపీ నేత విజయశాంతి ఆరోపించారు. శనివారం ఆమె సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన ఒక ప్రకటనలో కేసీఆర్ కరోనా ఆంక్షలు పక్కనపెట్టి మద్యం అమ్మకాలపై దృష్టిపెట్టారని తప్పుబట్టారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి ప్రజలతో పాటు డాక్టర్లు కరోనా బారినపడుతున్నారని, కోర్టు మొట్టికాయలు వేయడంతోనే ఫీవర్ సర్వే చేస్తున్నారని తెలిపారు. వైద్యశాఖలో 10 వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయన్న సీఎం.. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదు? అని విజయశాంతి ప్రశ్నించారు.



Updated Date - 2022-01-22T20:52:09+05:30 IST