కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల బరితెగింపు

ABN , First Publish Date - 2021-06-18T16:51:21+05:30 IST

కృష్ణా జిల్లా నందివాడ మండలంలో వైసీపీ నేతలు బరితెగించారు.

కృష్ణా జిల్లాలో వైసీపీ నేతల బరితెగింపు

విజయవాడ: కృష్ణా జిల్లా నందివాడ మండలంలో వైసీపీ నేతలు బరితెగించారు. పుట్టగుంట గ్రామంలోని మూడు ఎకరాల ప్రభుత్వ అసైన్డ్ భూముల్లో అక్రమంగా రొయ్యల చెరువుల తవ్వకాలు చేపట్టారు.  కోటి రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూముల్లో చెరువులు తవ్వుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోని వైనం నెలకొంది.  చెరువు గట్టు నిర్మాణానికి యదేచ్ఛగా పాత బుడమేరు కట్టలపై మట్టి తవ్వకాలు చేపట్టారు. కాగా అక్రమ తవ్వకాలను నిలుపుదల చేశామని తహశీల్దార్ చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితుల్లో ఏడు ప్రొక్లెన్లతో పగలు, రాత్రి అనే వ్యత్యాసం లేకుండా  వైసీపీ నేతలు అక్రమ చెరువు తవ్వకాలు చేస్తున్నారు. అక్రమ చెరువు గట్ల ఏర్పాటుకు, బుడమేరు కట్ట తవ్వకంతో పరీవాహక రైతులకు ముంపు భయం పట్టుకుంది. వైసీపీ నేతల ఆక్రమణల వైపు కన్నెత్తి చూడని రెవెన్యూ శాఖ అధికారులపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పుట్టగుంట గ్రామ సర్పంచ్, వైసిపి జెడ్పిటిసి అభ్యర్థిని భర్త పర్యవేక్షణలో నిరాటంకంగా ఆక్రమణ జరుగుతోంది. 

Updated Date - 2021-06-18T16:51:21+05:30 IST