దేవినేనితో కలిసి తోలుకోడు వెళ్లనున్న టీడీపీ మహిళా నేతల బృందం

ABN , First Publish Date - 2021-06-24T16:48:20+05:30 IST

తోలుకోడు గ్రామంలో నిన్న చోటుచేసుకున్న మల్లాది నాగేంద్రమ్మ మృతికి సంబంధించిన

దేవినేనితో కలిసి తోలుకోడు వెళ్లనున్న టీడీపీ మహిళా నేతల బృందం

విజయవాడ: తోలుకోడు గ్రామంలో నిన్న చోటుచేసుకున్న మల్లాది నాగేంద్రమ్మ మృతికి సంబంధించిన ఘటనా స్థలాన్ని మహిళా నేతల బృందంతో కలిసి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు  సందర్శించనున్నారు. ఇప్పటికే టీడీపీ మహిళా నేతలు మైలవరం పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.  మాజీ జెడ్పీ చైర్ పర్సన్ గద్దె అనురాధ, నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, విజయవాడ పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చెన్నుపాటి ఉషారాణి, విజయవాడ పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షురాలు సుచిత్ర, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు బొమ్మసాని జ్యోతి తదితర మహిళా నేతల బృందం తోలుకోడు వెళ్ళనున్నారు.

Updated Date - 2021-06-24T16:48:20+05:30 IST