విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధం
ABN , First Publish Date - 2020-08-11T17:25:25+05:30 IST
స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి.
విజయవాడ: స్వర్ణా ప్యాలెస్ ప్రమాదంపై జిల్లా కమిటీ నివేదికలు సిద్ధమయ్యాయి. ఫైర్, విద్యుత్, వైద్య మరియు భద్రతా కమిటీలు నివేదికలను సిద్ధం చేశాయి. ఈ రోజు సాయంత్రం కలెక్టర్ ఇంతియాజ్కు కమిటీలు నివేదిక ఇవ్వనున్నాయి.
నివేదికలో కీలకాంశాలు ఇవే:-
* స్వర్ణా ప్యాలెస్ లో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే సమాచారం ఇవ్వలేదు.
* కొద్దిసేపు ప్రయత్నించి మంటలు చెలరేగిన తర్వాత ఫైర్కి సమాచారం.
* అగ్ని ప్రమాదం గుర్తించే కనీస పరికరాలు, స్మోక్ డిటెక్టర్, పని చేయని అలారం వల్లే అత్యధిక మంది మృతి.
* రమేష్ ఆసుపత్రి, స్వర్ణా ప్యాలెస్ యజమాన్యాల నిర్లక్ష్యం వల్ల ప్రమాదం.
* రమేష్ ఆసుపత్రి ప్రభుత్వ నిబంధనలు పాటించ లేదు.
* కోవిడ్ పేషేంట్స్ నుంచి భారీగా వసూలు చేసినట్టు నివేదిక.
* అనుమతికి మించి పేషేంట్స్ను చేర్చుకున్నట్టు నివేదిక.
* భద్రతా ప్రమాణాలు లేకపోయినా స్వర్ణా ప్యాలెస్లో కోవిడ్ కేర్ సెంటర్ను ఏర్పాటుకు అనుమతి.
* షార్ట్ సర్క్యూట్ జరిగే అవకాశాలు చాలా తక్కువని, కలప, ఫైబర్తో చేసిన ఇంటీరియర్ డెకరేషన్కు సానిటైజేషన్ వాడకం ఎక్కువగా ఉండటం వల్ల మంటలు త్వరగా వ్యాపించాయని విద్యుత్ శాఖ కమిటీ నివేదిక.