విజయవాడలో విద్యార్థి, యువజన సంఘాల నిరసన
ABN , First Publish Date - 2020-12-04T17:49:51+05:30 IST
రైతు సంఘాలకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు.
విజయవాడ: రైతు సంఘాలకు మద్దతుగా విద్యార్థి, యువజన సంఘాలు శుక్రవారం ఉదయం నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సహాకార్యదర్శి ఎస్ఎఫ్ఐ ప్రసన్న కుమార్ మాట్లాడుతూ కేంద్రం తెచ్చిన 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతు సంఘాలతో చర్చలు జరుపకుండా మూడు బిల్లులు పార్లమెంట్లో ఎలా ఏమోదిస్తారని ప్రశ్నించారు. కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చడానికే ఈ బిల్లులు ఆమోదించారని విమర్శించారు. రైతులకు మద్దతుగా ఉద్యమం కొనసాగిస్తామని ప్రసన్న కుమార్ స్పష్టం చేశారు.