రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభ
ABN , First Publish Date - 2021-01-20T16:27:25+05:30 IST
రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభకు అధికార పక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
గుంటూరు: రేపు విజయవాడలో రేషన్ పంపిణీ వాహనాల ప్రారంభ సభకు అధికార పక్షం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా నలుమూలల నుంచి రెవిన్యూ సిబ్బందితో లబ్దిదారుల తరలింపు ప్రక్రియను చేపట్టారు. ఆర్టీసీ బస్సులలో విజయవాడకు వీఆర్వోలను తరలిస్తున్నారు. సామాజిక దూరం లేకుండా బస్సులు నిండా ఎక్కించి పంపుతూ.. అధికారులు కరోనా నిబంధనలను పాటించని పరిస్థితి నెలకొంది. స్థానిక ఎన్నికలకు ఉన్న కరోనా సీఎం సభలకు లేదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.