విజయవాడలో ఏసీబీకి చిక్కిన అవినీతి చేప
ABN , First Publish Date - 2020-07-10T03:05:47+05:30 IST
విజయవాడ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో పడ్డారు.
విజయవాడ : జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలలో పడ్డారు. లంచం తీసుకుంటుండగా గుంటూరు ఏసీబీ అధికారులకు వీరాస్వామి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. జియాలజిస్ట్ వీరాస్వామి భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. కృష్ణాజిల్లా చల్లపల్లిలో విజయ్ సాగర్ లీజుకు తీసుకున్న పట్టాభూమిలో ఇసుక తవ్వకానికి వీరాస్వామి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గుంటూరులోని చంద్రమౌళినగర్ వద్ద లంచం డబ్బులు తీసుకుంటుండగా వలపన్ని గుంటూరు ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. నిందితుడు వీరాస్వామిని ఏసీబీ స్పెషల్ కోర్టులో ఏసీబీ హాజరుపరచనుంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.