AP: ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-10-12T14:29:43+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టోల్‌గేట్ వద్ద విధులు నిర్వహించే అధికారులతో పాటు అర్చకులను పోలీసులు నిలిపివేస్తున్నారు.

AP: ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టోల్‌గేట్ వద్ద విధులు నిర్వహించే అధికారులతో పాటు అర్చకులను పోలీసులు  నిలిపివేస్తున్నారు. విధులు నిర్వహించేందుకు వెళుతున్నామని ఐడి కార్డులు చూపిస్తున్నా పోలీసులు వదలకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. పోలీసుల తీరుపై అర్చకులు, అధికారులు మండిపడుతున్నారు. పోలీసులు వదలడం లేదంటూ దుర్గగుడి అధికారులకు సమాచారం అందించిన ఐదుగురు అర్చకులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు ప్రజాప్రతినిధులు, పోలీసులకు రెడ్ కార్పెట్ దర్శనం కల్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది. 

Updated Date - 2021-10-12T14:29:43+05:30 IST