vijayawada: రెవెన్యూశాఖ, పోలీసులకు మధ్య వాగ్వివాదం
ABN , First Publish Date - 2021-10-12T15:12:01+05:30 IST
ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారు. ఘాట్ రోడ్లో రెవెన్యూ, అర్చకులు, వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు.
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోలీసుల ఓవరాక్షన్ చేస్తున్నారు. ఘాట్ రోడ్లో రెవెన్యూ, అర్చకులు, వాహనాలను పోలీసులు నిలిపివేస్తున్నారు. దీంతో రెవెన్యూశాఖ, పోలీసులకు మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. విషయం తెలిసిన వెంటనే సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ నేరుగా రంగంలోకి దిగారు. దగ్గర ఉండి మరీ రెవెన్యూ వాహనాలను పంపిస్తున్నారు. మరోవైపు పాసులు లేని, ప్రోటోకాల్ లేని పోలీసు వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. పోలీసు వాహనాలకు మాత్రం నిబంధనలు, అనుమతులు వర్తించని పరిస్థితి ఉంది. దీంతో పోలీసుల తీరుపై రెవెన్యూ అధికారులు, అర్చకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.