AP: అత్తవారి ఇంటిపై అల్లుడు కత్తితో దాడి...మామ మృతి

ABN , First Publish Date - 2021-10-18T13:29:58+05:30 IST

కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తవారి ఇంటిపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు.

AP: అత్తవారి ఇంటిపై అల్లుడు కత్తితో దాడి...మామ మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా మైలవరం మండలం వెదురుబీడెం గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. అత్తవారి ఇంటిపై అల్లుడు దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో మామ మృతి చెందాడు. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో తెల్లవారుజామున అత్త, మామ, భార్యపై అల్లుడు రాంబాబు కత్తితో  దాడి చేశాడు. ఈ దాడిలో అత్త, భార్య, మరదలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్త, భార్యను విజయవాడ ఆస్పత్రికి... మామ ఏడుకొండలు, మరదలిని మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ మామ మృతి చెందాడు.  సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.  కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2021-10-18T13:29:58+05:30 IST