Vijayawada ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

ABN , First Publish Date - 2022-01-18T13:39:51+05:30 IST

విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది.

Vijayawada ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు కరోనా

అమరావతి: విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కలకలం రేపుతోంది. ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రవికిరణ్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. ఆయనతో పాటు  మరో 25 మంది జూనియర్ డాక్టర్లు,  ఇతర వైద్యులకు పాజిటివ్ అని తేలింది. అలాగే పారామెడికల్ సిబ్బంది కూడా కరోనా బారిన పడ్డారు. దీంతో ప్రభుత్వాస్పత్రిలో మొత్తం 50 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇంత మంది వైద్యులు కరోనా బారిన పడటంతో ఆస్పత్రిలో మిగిలిన వైద్యులు, రోగులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-01-18T13:39:51+05:30 IST