సీఎం జగన్ హామీ ఇచ్చారు.. అభివృద్ధి చేస్తాం: సోమినాయుడు

ABN , First Publish Date - 2020-10-22T00:01:34+05:30 IST

ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండనశాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను...

సీఎం జగన్ హామీ ఇచ్చారు.. అభివృద్ధి చేస్తాం: సోమినాయుడు

విజయవాడ: దుర్గగుడి ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు ఇస్తామని సీఎం జగన్‌ హామీ ఇచ్చారని దుర్గగుడి చైర్మన్‌ సోమినాయుడు తెలిపారు. కేశ ఖండనశాల, ప్రసాదం పోటు, భోజనశాలతో పాటు సోలార్ ప్యానెల్‌ను ఏర్పాటు చేయనున్నామని ఆయన చెప్పారు. కొండ చరియలు తొలగించడంతో పాటు ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని సోమినాయుడు స్పష్టం చేశారు. 


ఈవో సురేష్‌బాబు మాట్లాడుతూ ‘‘కొండ చరియలు విరిగిపడ్డ ఘటనలో ముగ్గురు గాయపడ్డారని చెప్పారు. ఘటనలో ఎవరూ చనిపోయినట్లు తమకు సమాచారం లేదు. కొండచరియల కింద ఎవరూ లేరని అనుకుంటున్నామన్నారు. ఘటనలో ఎక్కడా అధికారుల నిర్లక్ష్యం లేదు’’ అని అన్నారు. 







Updated Date - 2020-10-22T00:01:34+05:30 IST