AP: ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపశృతి
ABN , First Publish Date - 2021-10-06T13:28:46+05:30 IST
ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అంతరాలయం మండపంలో ఓ యువకుడు మృతి చెందాడు.
విజయవాడ: ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో అపశృతి చోటు చేసుకుంది. అంతరాలయం మండపంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఇంద్రకీలాద్రి అమ్మవారి అంతరాలయంలో షామియానా సిబ్బందిలో 36 సంవత్సరాలు గల యువకుడు పూలు కట్టడానికి పైకి ఎక్కి సిపాయి బల్ల కదిలి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరపై నుండి నుండి కింద పడ్డాడు. కింద పడే సమయంలో క్యూలైన్లో ఉన్న ఐరన్ రాడ్లపైన పడడంతో తలపై తీవ్రంగా గాయమైంది. వెంటనే యువకుడిని ఆలయ సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.