AP: ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం

ABN , First Publish Date - 2021-10-10T18:51:22+05:30 IST

ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు.

AP: ఇంద్రకీలాద్రిపై పోలీసుల అత్యుత్సాహం

విజయవాడ: ఇంద్రకీలాద్రిపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. హోంమంత్రి సుచరిత దుర్గమ్మ దర్శనానికి వస్తున్నారంటూ గంట నుంచి భక్తులకు పోలీసులు  చుక్కలు చూపిస్తున్నారు. వృద్ధులను కొండపైకి తీసుకువెళ్లే బస్సును కూడా నిలిపివేశారు. ఉదయం 11:10 గంటలకు హోంమంత్రి గుడికి వస్తారని అధికారులకు సమాచారం అందింది. దీంతో రెండు గంటల నుంచి కొండపైకి బస్సులు, వీఐపీ కార్లను కూడా పోలీసులు అనుమతించని పరిస్థితి ఏర్పడింది. పోలీసుల తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2021-10-10T18:51:22+05:30 IST