Vijayawadaలో కుటుంబం ఆత్మహత్యకు కారణమిదే...!

ABN , First Publish Date - 2022-01-08T17:36:10+05:30 IST

నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Vijayawadaలో కుటుంబం ఆత్మహత్యకు కారణమిదే...!

నిజామాబాద్/విజయవాడ: నిజామాబాద్ జిల్లాకు చెందిన సురేష్ కుటుంబం విజయవాడలో ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది. నగరంలోని గంగస్తాన్-2 ప్రాంతంలో పప్పుల సురేష్ కుటుంబం  నివసిస్తోంది. కుటుంబ సభ్యులు గత పది రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవల తమ మెడికల్ షాపు అమ్మేసిన సురేష్ ఓ పెట్రోల్‌బంక్‌ లీజుకు తీసుకున్నాడు. అయితే బంక్ సరిగా నడవకపోవడంతో అప్పులపాలయ్యాడు. సుమారు రెండు కోట్ల వరకు అప్పులు ఉన్నట్లు తెలుస్తోంది. పెట్రోల్‌బంక్ యజమానికి 75 లక్షల వరకు అప్పు ఉందని సమాచారం. ఈ బాధలు తాళలేక విజయవాడలో కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రాథమికంగా తెలియవచ్చింది. 

Updated Date - 2022-01-08T17:36:10+05:30 IST