AP: పల్టీలు కొట్టిన బైక్...యువకుడు మృతి
ABN , First Publish Date - 2021-09-14T16:50:31+05:30 IST
కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం బుద్దవరం ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొస్తున్న ఓ బైక్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది.
విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం దావాజీగూడెం బుద్దవరం ప్రధాన రహదారిపై వేగంగా దూసుకొస్తున్న ఓ బైక్ అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో అజ్జాపూడి గ్రామానికి చెందిన నవ్వులూరి కాంత్రి కుమార్(23) మృతి చెందాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గన్నవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.