ఏపీ ఉన్నతాధికారులతో పీఎఫ్సీ, ఆర్ఈసీ ప్రతినిధుల భేటీ
ABN , First Publish Date - 2021-11-17T19:48:53+05:30 IST
ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ఢిల్లీ నుంచి వచ్చిన పీఎఫ్సీ, ఆర్ఈసీ ప్రతినిధులు..
విజయవాడ: ఏపీ ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలపై ఢిల్లీ నుంచి వచ్చిన పీఎఫ్సీ, ఆర్ఈసీ ప్రతినిధులు.. ఇంధన శాఖ డిస్కం ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. రెండున్నర గంటలుగా ఈ సమావేశం కొనసాగుతోంది. విద్యుత్ సౌధాలో ఈ భేటీ జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ చెల్లించాల్సిన బకాయిల వసూళ్లకు ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర సంస్థల ప్రతి నిధులు బుధవారం విద్యుత్ సౌధకు చేరుకున్నారు. జెన్కో, ఇంధన శాఖ అధికారులతో పీఎఫ్సీ, ఆర్ఈసీ సంస్థల సీఎండీలు భేటీ అయ్యారు. పది మంది అధికారులు సమావేశానికి వచ్చారు. కాగా మీడియాను విద్యుత్ సౌధ ప్రాంగణంలోకి కూడా అనుమతించేందుకు అధికారులు నిరాకరిస్తున్నారు.
మరోవైపు ఈరోజు మధ్యాహ్నం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శితో కేంద్ర సంస్థల ప్రతినిధులు సమావేశం కానున్నారు. అలాగే సాయంత్రం సీఎం జగన్ను ఇరువురు కేంద్ర సంస్థల సీఎండీలు కలువనున్నారు.