తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు ఏపీ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు
ABN , First Publish Date - 2021-05-17T13:45:11+05:30 IST
తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తౌక్టే తీరం దాటనుంది.
విజయవాడ: తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి. ఈనెల 18న గుజరాత్ వద్ద తౌక్టే తీరం దాటనుంది. ఈక్రమంలో వాతావరణ హెచ్చరికలు, కేంద్రం ఆదేశాలతో 126 మందితో కూడిన విజయవాడ ఎన్డీఆర్ఎఫ్ బృందం తౌక్టే ప్రభావిత రాష్ట్రాలకు తరలివెళ్లాయి. విపత్తు సమయంలో సహాయక చర్యల సామగ్రితో బలగాలు బయలుదేరాయి. ఈరోజు ఉదయం గన్నవరం విమానాశ్రయం నుంచి మూడు ప్రత్యేక వాయుసేన విమానాల్లో ఆయా రాష్ట్రాలకు ఎన్డీఆర్ఎఫ్ బలగాలు తరలివెళ్లాయి.