AP: పెనుగంచిప్రోలులో టమాట దొంగలు
ABN , First Publish Date - 2021-11-27T18:36:34+05:30 IST
విలువైన వస్తువులు, నగదు, డబ్బును దొంగతనం చేసేవాళ్లను చూశాం కానీ... ఏకంగా టమాటలను దొంగతనం చేశారు కొందరు వ్యక్తులు.
విజయవాడ: విలువైన వస్తువులు, నగదు, డబ్బును దొంగతనం చేసేవాళ్లను చూశాం కానీ... ఏకంగా టమాటలను దొంగతనం చేశారు కొందరు వ్యక్తులు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో చోటు చేసుకుంది. టమాట ధరలు రోజు రోజుకు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మార్కెట్లో కిలో టమాట ధర రూ.130కి చేరింది. ఈ క్రమంలో పెనుగంచిప్రోలులో దుండగులు టమాటాలను దొంగతనం చేశారు. మార్కెట్లో టమాటాకు మంచి డిమాండ్ ఉండటంతో వాటిపై ఆగంతకుల కన్ను పడింది. పెనుగంచిప్రోలు కూరగాయల మార్కెట్లో గురువారం రాత్రి 3 ట్రేల టమాటాలు మాయమయ్యాయి. ఒక ట్రే రూ.2000 పైగా ఉంటుందని వ్యాపారస్తులు తెలిపారు. నెల రోజులు కష్టపడి కూరగాయలు అమ్ముకున్న ఆరువేల రూపాయలు కూడా గిట్టవని... అలాంటిది 6000 విలువగల టమాటాలు మాయమవటంతో వ్యాపారస్తులు లబోదిబోమంటున్నారు.