కార్యాలయంలో మార్పులపై ఎస్ఈసీ విచారణ

ABN , First Publish Date - 2020-08-06T03:20:23+05:30 IST

రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ చేపట్టారు. కార్యాలయంలో మార్పులకు ఎవరు అధికారం ఇచ్చారనే దానిపై విచారించారు. నిమ్మగడ్డ రమేష్

కార్యాలయంలో మార్పులపై ఎస్ఈసీ విచారణ

విజయవాడ: రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో చేపట్టిన మార్పులపై ఎస్ఈసీ విచారణ చేపట్టారు. కార్యాలయంలో మార్పులకు ఎవరు అధికారం ఇచ్చారనే దానిపై విచారించారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టక ముందే కార్యాలయంలో అధికారులు మార్పులు చేశారు. ఎస్ఈసీ ఛాంబర్, అధికారుల కార్యాలయం మధ్య రాకపోకలు జరిపే ద్వారాన్ని అధికారులు మూసివేశారు. అయితే వాస్తు పేరిట కార్యాలయంలో మార్పులు చేశారని జరుగుతోన్న ప్రచారంపై ఎస్ఈసీ వివరణ ఇచ్చారు. తాను బాధ్యతలు చేపట్టక ముందే కార్యాలయంలో మార్పులు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని అన్నారు.

Updated Date - 2020-08-06T03:20:23+05:30 IST