కటకటాల్లోకి విజయవాడ సూసైడ్ నిందితులు

ABN , First Publish Date - 2022-01-13T23:31:08+05:30 IST

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడలో జరిగిన

కటకటాల్లోకి విజయవాడ సూసైడ్ నిందితులు

విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన విజయవాడలో జరిగిన ఫ్యామిలీ సూసైడ్ కేసులో నిందితులను పోలీసులు కటకటాల్లోకి పంపారు. నిజామాబాద్ ఫ్యామిలీ సూసైడ్ కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. జ్ఞానేశ్వర్, చంద్రశేఖర్, వినీతలను బెజవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు గణేష్ పరారీలో ఉన్నాడు. సూసైడ్‌కి ముందు పప్పుల సురేష్ ఫ్యామిలీ తీవ్ర ఒత్తిడికి గురైంది. వసతి గృహం లోపల చనిపోయిన భార్య శ్రీలత, ఆశీష్‌లను గదిలో వదిలి వెళ్లి నదిలో దూకి  సురేష్, కుమారుడు అఖిల్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకోవటానికి వెళ్లే ముందు వారున్న గదిలోకి, బయటకు రెండుసార్లు తిరిగి చివరికి నదిలో దూకి రమేష్, అఖిల్ సూసైడ్ చేసుకున్నారు.  ఆత్మహత్యకు ముందు ఒత్తిడితో కారిడార్‌లో తిరుగుతూ సీసీ టీవీ ఫుటేజ్‌లో సురేష్, అఖిల్ కనిపించారు. 

Updated Date - 2022-01-13T23:31:08+05:30 IST