ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని.. కేశినేనిపై బుద్దా తీవ్ర వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-03-06T17:56:42+05:30 IST

టీడీపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది.

ఆ రోజే చెప్పుతో కొట్టేవాడిని.. కేశినేనిపై బుద్దా తీవ్ర వ్యాఖ్యలు

విజయవాడ: టీడీపీ నేతల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు... ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వర్గంలో కీలక నేత అయిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ... గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. తమకెంతో బాధగా ఉందన్నారు. చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు. ‘‘నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడు. టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడు’’ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-03-06T17:56:42+05:30 IST