Vijayawada: బాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ టీడీపీ ఆందోళనలు

ABN , First Publish Date - 2021-09-18T18:44:18+05:30 IST

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు పార్టీ ఆఫీస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు.

Vijayawada: బాబు ఇంటిపై దాడిని ఖండిస్తూ టీడీపీ ఆందోళనలు

విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటిపై వైసీపీ శ్రేణుల దాడిని ఖండిస్తూ టీడీపీ నేతలు  పార్టీ ఆఫీస్‌లో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. నల్లజెండాలతో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు. జోగి రమేష్ డౌన్ డౌన్ అంటూ టీడీపీ శ్రేణులు నినాదాలు చేశారు. జోగి రమేష్ చిత్రపటాన్ని, సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటాన్ని కాల్చి బూడిద చేశారు. జెట్ క్యాటగిరి ఉన్న చంద్రబాబు, 14 సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబుపై దాడిని ఖండిస్తూ పెద్దఎత్తున మహిళల ఆందోళనలకు దిగారు. మంత్రి పదవి కోసం ఎంతకైనా దిగజారుతారా? అంటూ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Updated Date - 2021-09-18T18:44:18+05:30 IST