కైకలూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం

ABN , First Publish Date - 2021-03-05T17:10:32+05:30 IST

కైకలూరులో జరిగిన బంద్‌లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది.

కైకలూరులో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం

విజయవాడ: కైకలూరులో జరిగిన బంద్‌లో టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణపై వైసీపీ వర్గీయులు  దాడికి ప్రయత్నించారు. దీంతో వెంటనే టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో టీడీపీ కార్యకర్తల చేతుల్లోని ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తలు లాక్కున్నారు. వైసీపీ వర్గీయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన జయమంగళ వెంకటరమణ జాతీయ రహదారిపై బైఠాయించి నిరసనకు దిగారు. వైసీపీ వర్గీయులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-03-05T17:10:32+05:30 IST