వికారాబాద్లో దారుణం
ABN , First Publish Date - 2021-07-17T16:07:12+05:30 IST
జిల్లాలోని దోమ మండలం మైలారం గ్రామంలో దారుణం జరిగింది.
వికారాబాద్: జిల్లాలోని దోమ మండలం మైలారం గ్రామంలో దారుణం జరిగింది. చెరువులో విష ప్రయోగం జరగడంతో వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయి. గత మూడు రోజులుగా చేపలు చనిపోతున్నాయి. చెరువు దరికి ఎక్కడ చూసినా చనిపోయిన చేపలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనపై గ్రామస్థులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.