వికారాబాద్లో road accident....ముగ్గురు మృతి
ABN , First Publish Date - 2021-07-26T15:55:54+05:30 IST
జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వికారాబాద్: జిల్లాలోని పూడూరు మండలం మన్నెగూడ దరణి కాటన్ మిల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎదురుగా వస్తున్న క్వాలీస్ వాహనం ఎక్సల్ రాడ్ విరిగి పోవడంతో ఎదురుగా వస్తున్న సాంట్రో కారుపైకి దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.