Vikarabad: లావాదేవీల విషయం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది

ABN , First Publish Date - 2021-07-19T17:37:07+05:30 IST

తాండూరులో దారుణం జరిగింది. ఇద్దరు వ్యాపారుల లావాదేవీల విషయం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే..2014 నుంచి తాండూర్ మండలం సంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పట్ల శ్రీధర్ రెడ్డి, తాండూరుకు చెందిన

Vikarabad: లావాదేవీల విషయం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది

వికారాబాద్: తాండూరులో దారుణం జరిగింది. ఇద్దరు వ్యాపారుల లావాదేవీల విషయం ఒకరి ప్రాణాల మీదకు తెచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే..2014 నుంచి తాండూర్ మండలం సంకిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన పట్ల శ్రీధర్ రెడ్డి, తాండూరుకు చెందిన బంట్వారం సతీష్ ఇద్దరు కలిసి గనుల వ్యాపారం ప్రారంభించారు. వీరిద్దరి వ్యాపారంలో లావాదేవీల విషయంలో కొంచెం తేడా రావడంతో పట్ల శ్రీనివాస్ రెడ్డిని మాట్లాడుకుందామని సతీష్ రెడ్డిని తాండూర్‎కు రప్పించాడు. ఇద్దరు కలిసి లావాదేవీల విషయంలో మాట్లాడుతుండగా..ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదానికి దారి తీసింది..ఒక్కసారిగా ఆగ్రహానికి గురైన సతీష్ ..శ్రీనివాస్ రెడ్డిని కత్తితో కడుపులో పొడిచి ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. అక్కుడున్న స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఘటనాపై సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-07-19T17:37:07+05:30 IST