గ్రామస్థాయి పరిపాలన దేశప్రగతికి వెన్నెముక
ABN , First Publish Date - 2021-10-17T05:07:38+05:30 IST
గ్రామస్థాయిలోని స్థానిక ప్రభుత్వాల పాలన దేశ ప్రగతికి వెన్నెముక అని రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు పేర్కొన్నారు.
చిట్వేలి, అక్టోబరు16 : గ్రామస్థాయిలోని స్థానిక ప్రభుత్వాల పాలన దేశ ప్రగతికి వెన్నెముక అని రాజంపేట డివిజనల్ పంచాయతీ అధికారి నాగరాజు పేర్కొన్నారు. శనివారం చిట్వేలి మండల పరిషత్ కార్యాలయ సభాభవనంలో సర్పంచ్లు, ఎంపీటీసీ సభ్యులు పంచాయతీ కార్యదర్శులతో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎల్పీవో మాట్లాడుతూ ఈ నెల 18వ తేదీ నుంచి జరగబోయే వార్డు సభ్యుల శిక్షణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో మండల ఎంపీపీ చంద్ర, ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యంరెడ్డి, ఎంపీడీవో నాగభూషణం, విస్తరణాధికారి పులిరామ్సింగ్, సర్పంచులు ఎల్.వి.మోహన్రెడ్డి, నరసింహ, బాలు, ప్రసాద్, సుబ్రహ్మణ్యంరెడ్డి, బాలు, రామాంజినాయుడు, ఎంపీటీసీ సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.