గ్రామాల అభివృద్ధి కృషి : చిరుమర్తి
ABN , First Publish Date - 2022-06-22T06:26:29+05:30 IST
గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు.
నకిరేకల్, జూన 21: గ్రామాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే లింగయ్య అన్నారు. మండలంలోని గోరెంకలపల్లి, మంగళపల్లి గ్రామాల్లో రూ.1కోటి పైచిలుకు వ్యయం తో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభోత్సవా లు, శంకుస్థాపన చేసి మాట్లాడారు. గోరెంకలపల్లి గ్రామంలో రూ. 20లక్షలతో సీసీ రోడ్డు, మనఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక పాఠశాలలో రూ.20 లక్షల పనులకు శంకుస్థాపన చేశా రు. మంగళపల్లి గ్రామంలో రూ.40లక్షల సీసీరోడ్డు, డ్రైనేజీలు, మన ఊరు మనబడి కార్యక్రమంలో రూ. 20లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలో రూ.4కోట్ల వ్యయంతో కాలంవారి కుంటపై నిర్మిస్తున్న మినీ ట్యాంక్బండ్ నిర్మాణ పనుల ను పరిశీలించారు. ఆయా కా ర్యక్రమాల్లో ము నిసిపల్ చైర్మన రాచకొండ శ్రీను, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి, సింగిల్విండో చైర్మన పల్రెడ్డి మహేందర్రెడ్డి, మంగళపల్లి, గోరెంకలపల్లి సర్పంచులు ప్రగడపు నవీనరావు, చెట్టిపల్లి జానయ్య పాల్గొన్నారు.